charan: 'రంగస్థలం' స్పెషల్ సాంగ్ షూటింగ్ మొదలు

  • టాకీ పార్టు పూర్తి చేసుకున్న 'రంగస్థలం' 
  • ఐటమ్ సాంగ్ కోసం రంగంలోకి 'పూజా హెగ్డే'
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్

సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' చిత్రం రూపొందుతోంది. చరణ్ .. సమంత నాయకా నాయికలుగా నటిస్తోన్న ఈ సినిమా, రీసెంట్ గా టాకీ పార్టును పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ వుంది .. పూజా హెగ్డేపై ఆ సాంగ్ ను చిత్రీకరించనున్నారనే వార్త కొన్ని రోజులుగా వినిపిస్తోంది. ఈ రోజున ఈ పాట చిత్రీకరణను మొదలుపెట్టినట్టుగా సమాచారం.

 ఈ ఐటమ్ సాంగ్ ను జానీ మాస్టర్ కంపోజ్ చేస్తున్నట్టుగా చెబుతున్నారు. సుకుమార్ సినిమాల్లోని ఐటమ్ సాంగ్స్ కి ఓ ప్రత్యేకత ఉంటుంది. ఈ ఐటమ్ సాంగ్స్ యూత్ ను .. మాస్ ఆడియన్స్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకునేలా వుంటాయి. 'ఆర్య' సినిమాలోని 'అ .. అంటే అమలాపురం'లోని ఐటమ్ సాంగ్ అందుకు ఓ నిదర్శనం. ఆ తరహాలోనే 'రంగస్థలం'లోని ఈ ఐటమ్ సాంగ్ ఉంటుందని అంటున్నారు. సుకుమార్ - దేవిశ్రీ కాంబినేషన్లోని ఈ సాంగ్ .. ఆడియన్స్ ను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.          

  • Loading...

More Telugu News