Arun Jaitly: కాసేపట్లో అరుణ్‌జైట్లీతో టీడీపీ ఎంపీల కీలక భేటీ.. తరువాత రాజ్‌నాథ్‌ సింగ్‌తో..!

  • మధ్యాహ్నం 3 గంటలకు జైట్లీ అపాయింట్‌మెంట్‌ కోరిన టీడీపీ ఎంపీలు
  • మధ్యాహ్నం 3.45 గంటలకు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ
  • విభజన చట్టంలో పేర్కొన్న అంశాలపై చర్చ

ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక నిధులపై ప్రకటన చేయలేదని టీడీపీ నేతలు మండిపడుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారు కాసేపట్లో ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీని కలవనున్నారు. టీడీపీ ఎంపీలు మధ్యాహ్నం 3 గంటలకు జైట్లీ అపాయింట్‌మెంట్‌ కోరినట్లు తెలిసింది. అలాగే, మధ్యాహ్నం 3.45 గంటలకు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో టీడీపీ ఎంపీలు సమావేశం కానున్నారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలపై వారు చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు. 

  • Loading...

More Telugu News