rakulpreeth sing: ‘అయ్యారీ’ సినిమాలో మార్పులు చేయాల్సిందేనంటున్న రక్షణ శాఖ

  • నీరజ్ పాండే దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అయ్యారీ’
  • దేశంలో, ఆర్మీలో జరుగుతున్న అవినీతి ఆధారంగా సినిమా
  • విడుదలకు ముందు ఈ సినిమాను వీక్షించిన రక్షణ శాఖ
  • కొన్ని సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయన్న రక్షణ శాఖ 

దేశంలో, ఆర్మీలో జరుగుతున్న అవినీతి ఆధారంగా చేసుకుని నీరజ్ పాండే దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అయ్యారీ’. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, రకుల్ ప్రీత్ సింగ్, మనోజ్ బాజ్ పాయ్, పూజా చోప్రా ప్రధాన పాత్రలు పోషించారు. అయితే,  ఈ సినిమాను విడుదల చేసే ముందు తమకు చూపించాలని చిత్ర యూనిట్ ను రక్షణ శాఖ కోరింది.

ఈ మేరకు, అధికారుల కోసం నిన్న మధ్యాహ్నం ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ సినిమాను వీక్షించిన అధికారులు కొన్ని మార్పులు చేయాలని, కొన్ని సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని, వాటిని మార్చమని సూచించారు. కాగా, ఈ నెల 9న ‘అయ్యారీ’ చిత్రం విడుదల కానుంది.

  • Loading...

More Telugu News