Cricket: సెంచూరియన్ వన్డే: భారత్ విజయలక్ష్యం 119 పరుగులు

  • రెండో వన్డే లో దక్షిణాఫ్రికా స్కోరు:  118/ ఆల్ అవుట్
  • నిలకడగా రాణించలేకపోయిన సఫారీలు
  • బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా

సెంచూరియన్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా విజయ లక్ష్యం 119 పరుగులుగా దక్షిణాఫ్రికా జట్టు నిర్దేశించింది. టాస్ గెలిచిన భారతజట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో దక్షిణాఫ్రికా జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. 32.3 ఓవర్లకే ఆల్ అవుటైన దక్షిణాఫ్రికా 118 పరుగులు చేసింది. సఫారీలు నిలకడగా రాణించలేకపోవడంతో త్వరత్వరగా వికెట్లు కోల్పోవాల్సి వచ్చింది. కాగా, 119 పరుగుల విజయ లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగింది. టీమిండియా ఓపెనర్లు ఆర్జీ శర్మ, శిఖర్ ధావన్ బ్యాటింగ్ ప్రారంభించారు.

దక్షిణాఫ్రికా బ్యాటింగ్ : 


ఆమ్లా - 23, కాక్ - 20, మార్క్రమ్ -8, డుమిని -25, మిల్లర్ - 0, జోండో - 25,  మోరిస్ -14, రబడా -1 , మోర్కెల్ -1, ఇమ్రాన్ తహీర్ - 0, షంశీ - 0

భారత్ బౌలింగ్ : 

భువనేశ్వర్ కుమార్ - 1, బుమ్రా -1, చాహల్ - 5, కులదీప్ యాదవ్ - 3

  • Loading...

More Telugu News