Andhra Pradesh: ఏపీ లో తలపెట్టిన బంద్ లో టీడీపీ నేతలు కూడా పాల్గొనాలి: సీపీఐ రామకృష్ణ

  • ఏపీ ప్రజలను మోదీ  ప్రభుత్వం మోసం చేస్తోంది
  • ఈ నెల 8న ఏపీ బంద్ కు పిలుపు
  • కేంద్రం నుంచి నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి: రామకృష్ణ

ఏపీ ప్రజలను మోదీ ప్రభుత్వం మోసం చేస్తోందని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. కేంద్రబడ్జెట్ లో ఏపీకి మొండిచెయ్యి చూపారని, కేంద్ర తీరును నిరసిస్తూ ఈ నెల 8న ఏపీ బంద్ కు పిలుపు నిచ్చామని అన్నారు. ఈ బంద్ కు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరామని, టీడీపీ నేతలు కూడా ఈ బంద్ లో పాల్గొనాలని ఆయన కోరారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని, రాష్ట్ర ప్రయోజనాల కోసం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని రామకృష్ణ కోరారు.

  • Loading...

More Telugu News