mother: కన్నతల్లిపై కిరోసిన్ పోసి.. నిప్పంటించిన యువతి!

  • సిద్దిపేట రూరల్‌ మండలం రాఘవాపూర్‌లో ఘటన
  • తల్లితో గొడవ పడి కూతురి దుశ్చర్య
  • 90 శాతం కాలిన గాయాలతో పరిస్థితి విషమం
  • హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తరలింపు

ఓ యువ‌తి త‌న‌ తల్లిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించిన ఘ‌ట‌న‌ సిద్దిపేట రూరల్‌ మండలం రాఘవాపూర్‌లో అల‌జ‌డి రేపింది. కూలీ ప‌నులు చేసుకుంటూ జీవ‌నం కొన‌సాగించే భర్త మల్లయ్య, లచ్చవ్వ (55) దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. పెద్ద‌ కూతుళ్లిద్ద‌రికీ పెళ్లిళ్లు జ‌రగ‌గా మూడో కూతురు సునీత ఇంటి ద‌గ్గ‌ర‌లో ఉంటూ, ఓ ఆసుప‌త్రిలో ప‌ని చేస్తోంది.

కాగా, తల్లీకూతుళ్లు ల‌చ్చ‌వ్వ‌, సునీత‌ ఓ విషయమై గొడవ ప‌డ్డారు. ఆగ్ర‌హంతో ఊగిపోయిన సునీత.. త‌ల్లిపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. ఈ విష‌యాన్ని గుర్తించిన స్థానికులు వెంట‌నే వ‌చ్చి మంటలను ఆర్పారు. కానీ, అప్ప‌టికే ల‌చ్చ‌వ్వ శ‌రీరం చాలా భాగం కాలిపోయింది. 90 శాతం కాలిన గాయాలతో ఆమె ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని సిద్ధిపేట‌ వైద్యులు తెలప‌డంతో ఆమెను హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రికి త‌ర‌లించారు.

  • Loading...

More Telugu News