raghuveera reddy: ఏపీలోని 13 జిల్లాలకు కాంగ్రెస్ ఐటీ సెల్ ఇన్ ఛార్జిల నియామకం.. ఏయే జిల్లాకు ఎవరంటే..!

  • ఇన్ ఛార్జిలను నియమించిన రఘువీరా
  • నేటి నుంచే అమల్లోకి
  • జిల్లా అధ్యక్షులు, నగర అధ్యక్షులు సహకరించాలన్న రఘువీరా

ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలకు కాంగ్రెస్ ఐటీ సెల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్లను నియమించారు. ఈ రోజు నుంచే ఈ నియామకాలు అమల్లోకి వస్తాయని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆయా జిల్లాల్లోని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కోఆర్డినేటర్ల నియామకాలకు సహకరించాలని ఈ సందర్భంగా రఘువీరా కోరారు.

జిల్లాల వారీగా ఇన్ ఛార్జీల వివరాలు:
అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప - పీఎస్ అహ్మద్ హుస్సేన్
ప్రకాశం, నెల్లూరు - అంబటి రామకృష్ణ
గుంటూరు, కృష్ణా - ఎస్కే మౌలాలి
పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి - తాళ్లూరి విజయ్ కుమార్
విశాఖపట్నం అర్బన్, రూరల్ - మనోహర్ గంగిరెడ్డి
విజయనగరం, శ్రీకాకుళం - డాక్టర్ బి.సతీష్

  • Loading...

More Telugu News