shiva prasad: 'అంతా దేవుడికే తెలుసు'.. బడ్జెట్‌పై ఢిల్లీలో వినూత్నంగా నిరసన తెలిపిన టీడీపీ ఎంపీ శివప్రసాద్

  • కేంద్ర బడ్జెట్ నిరాశ కలిగించిందని టీడీపీ నేతల ఆగ్రహం
  • ఆకాశంవైపు తన చూపుడు వేలును చూపిన ఎంపీ శివప్రసాద్
  • మౌన భాషలో సమాధానాలు

కేంద్ర బడ్జెట్ నిరాశ కలిగించిందని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఢిల్లీలో చిత్తూరు ఎంపీ శివప్రసాద్ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. 'అంతా దేవుడికే తెలుసు' అన్నట్లు ఆకాశంవైపు తన చూపుడు వేలును చూపించారు. మౌన భాషలో మాట్లాడుతూ నిరసన వ్యక్తం చేశారు. మీడియా అడుగుతోన్న ప్రశ్నలకు కూడా మూగ సైగలు చేస్తూ సమాధానం ఇచ్చారు. కారులోంచి ఓ కత్తి, కాళ్ల గజ్జలు, తలపాగా తీసి చూపించారు. ఎంపీ శివప్రసాద్ ఏ విషయంపై అయినా నిరసన తెలపాల్సి వస్తే ఇలాగే వినూత్నంగా ప్రదర్శన చేపడతారన్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News