budget: కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణలకు కేటాయింపుల వివరాలు..!

  • హైదరాబాద్‌ ఐఐటీకి రూ.75 కోట్లు
  • విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు రూ.1,400 కోట్లు
  • విశాఖ పోర్టుకు రూ.108 కోట్లు

ఈ రోజు పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు పలు కేటాయింపులు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీకి రూ.32 కోట్లు, కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రూ.10 కోట్లు, గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.10 కోట్లు, ఎన్‌ఐటీకి రూ.54కోట్లు, ఐఐటీకి రూ.50కోట్లు, ట్రిపుల్‌ ఐటీకి రూ.30 కోట్లు, ఐఐఎంకు రూ.42 కోట్లు, ఐఐఎస్‌సీఆర్‌కు రూ.49కోట్లు, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు రూ.1,400 కోట్లు, విశాఖ పోర్టుకు రూ.108 కోట్లు, డ్రెడ్జింగ్‌ కార్పోరేషన్‌కు రూ.19.62కోట్లు ఇచ్చారు. అలాగే, పరిశ్రమలకు వడ్డీ రాయితీ కోసం రూ.50 కోట్లు కేటాయించారు.

ఇక తెలంగాణ విషయానికి వస్తే... పరిశ్రమలలకు వడ్డీ రాయితీ కోసం రూ.50 కోట్లు, నల్గొండ-లింగంగుంట మార్గంలో 129 కి.మీ. మేర ఎలక్ట్రిఫికేషన్, పెద్దపల్లి-లింగంపేట మార్గంలో 83కి.మీ. మేర ఎలక్ట్రిఫికేషన్ కోసం కేటాయించారు. కాగా, హైదరాబాద్‌ ఐఐటీకి రూ.75 కోట్లు, గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.10 కోట్లు, సింగరేణికి రూ.2 వేల కోట్లు కేటాయించారు.  

  • Loading...

More Telugu News