karthi: కార్తీ షూటింగును తనయుడితో కలిసి చూసిన సూర్య

  • సూర్య నిర్మాణంలో 'కడైకుట్టి సింగం'
  • కథానాయకుడిగా కార్తీ 
  • ఆయన సరసన సాయేష సైగల్

కోలీవుడ్ లో సూర్య .. కార్తీ ఇద్దరూ కూడా అగ్రకథానాయకులుగా వెలుగొందుతున్నారు. తెలుగులోనూ ఈ ఇద్దరి సినిమాలకి మంచి మార్కెట్ వుంది. ప్రస్తుతం సూర్య బ్యానర్లో కార్తీ 'కడైకుట్టి సింగం' అనే సినిమా చేస్తున్నాడు. ఈ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ కి పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించి 'రెక్లా' (ఎడ్లబండ్ల) పోటీలను చిత్రీకరించారు. భారీ సంఖ్యలో గల ఎడ్ల బండ్లతో కార్తీ .. తదితరులపై యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించారు. ఈ సన్నివేశాల చిత్రీకరణకు సూర్య .. తన తనయుడు దేవ్ తో కలిసి వచ్చాడు. చాలా దగ్గర నుంచి ఆయన ఈ సన్నివేశాల చిత్రీకరణను చూశాడు. ఆ సందర్భంలో తీసిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తాను చిన్నతనంలో వచ్చిన ఈ ప్రదేశానికి .. తన తనయుడితో కలిసి రావడం ఆనందంగా ఉందని సూర్య చెప్పాడు. ఈ సినిమాలో కార్తీ జోడీగా సాయేషా సైగల్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.   

  • Loading...

More Telugu News