budget: పార్లమెంట్ కు చేరుకున్న ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ

  • కేంద్ర కేబినెట్ భేటీ మొదలు
  • మరి కొద్ది సేపట్లో పార్లమెంటులో బడ్జెట్ పై ప్రకటన 
  • బీజేపీ ప్రభుత్వానికి చివరి పూర్తి స్థాయి బడ్జెట్

ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటు ప్రాంగణానికి కొద్ది సేపటి క్రితమే చేరుకున్నారు. ఆర్థిక మంత్రి వెంట బడ్జెట్ ప్రతుల సూట్ కేసు సైతం పార్లమెంట్ కు చేరుకుంది. ఈ ఉదయం 11 గంటలకు అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రకటన చేయనున్నారు. యూనియన్ బడ్జెట్ ఆమోదం కోసం కేంద్ర కేబినెట్ సమావేశం ఆరంభమైంది. అనంతరం దాన్ని ఆర్థిక మంత్రి పార్లమెంటులో ప్రవేశపెడతారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుకు రానున్న సార్వత్రిక ఎన్నికల ముందు, చివరి పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

  • Loading...

More Telugu News