shrwanand: త్వరలోనే 'దాగుడుమూతలు'తో సెట్స్ పైకి హరీశ్ శంకర్

  • హరీశ్ శంకర్ దర్శకత్వంలో 'దాగుడుమూతలు'
  • హీరోలుగా శర్వానంద్ .. నితిన్ 
  • మే నెలలో సెట్స్ పైకి    

'సుబ్రమణ్యం ఫర్ సేల్' .. ' దువ్వాడ జగన్నాథం' సినిమాలతో ఆడియన్స్ ను అలరించిన హరీశ్ శంకర్, తన తదుపరి సినిమా 'దాగుడుమూతలు'కి సంబంధించిన పనుల్లో బిజీగా వున్నాడు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాలో నితిన్ .. శర్వానంద్ కథానాయకులుగా కనిపించనున్నారు. ఈ ఇద్దరి సరసన జతకట్టే కథానాయికల విషయంలో స్పష్టత రావలసి వుంది.

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ ను హరీశ్ శంకర్ సిద్ధం చేశాడు. మే నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టడానికి ప్లాన్ చేశారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాతో, మాస్ ను .. యూత్ ను కూడా మెప్పించేలా హరీశ్ శంకర్ జాగ్రత్తలు తీసుకున్నాడు. అనిల్ రావిపూడితో ఓ సినిమా .. సతీశ్ వేగేశ్నతో ఓ సినిమాను నిర్మిస్తోన్న దిల్ రాజు, హరీశ్ శంకర్ తో ఈ సినిమాను ప్లాన్ చేయడం విశేషం.    

  • Loading...

More Telugu News