school: పాఠశాలలో చిన్నారి ముఖంపై వేడివేడి పప్పుచారు పోసిన వంటమనిషి.. తీవ్రగాయాలు

  • మధ్యప్రదేశ్‌లోని దిండోరీ ప్రాంతంలో ఘటన
  • అన్నం తింటూ ప‌ప్పు చారు అయిపోవ‌డంతో రెండోసారి కావాల‌ని అడిగిన చిన్నారి
  • ఆగ్ర‌హంతో ఊగిపోయిన‌ వంటమనిషి
  • విద్యార్థికి ఆసుపత్రిలో చికిత్స 

ఓ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో చిన్నారిపై వంట మ‌నిషి వేడి వేడి ప‌ప్పు చారు పోసిన ఘ‌ట‌న మధ్యప్రదేశ్‌లోని దిండోరీ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఐదో త‌ర‌గ‌తి విద్యార్థి ప్రిన్స్‌ మెహ్రా త‌న పాఠ‌శాల‌లో ఉచిత మధ్యాహ్న భోజనం చేస్తున్నాడు. మొద‌టిసారి పోయించుకున్న ప‌ప్పు చారు అయిపోవ‌డంతో రెండోసారి కావాల‌ని అడుగుతూ వంట‌మ‌నిషి ద‌గ్గ‌ర‌కు వెళ్లాడు. దీంతో ఆగ్ర‌హంతో ఊగిపోయిన‌ వంటమనిషి నెంవతి బాయి అత‌డిపై వేడివేడి పప్పుచారును పోయ‌డంతో ఆ చిన్నారి ముఖం, ఛాతీపై తీవ్ర గాయాలయ్యాయి. ప్ర‌స్తుతం ఆ విద్యార్థికి ఆసుప‌త్రిలో చికిత్స అందుతోంది. ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.

  • Loading...

More Telugu News