kamal: 'భారతీయుడు' సీక్వెల్ లో నయనతార

  • 'భారతీయుడు' సీక్వెల్ కి సన్నాహాలు
  • లైకా ప్రొడక్షన్స్ లో నిర్మాణం  
  • కథానాయికగా నయనతార పేరు

ప్రస్తుతం శంకర్ .. '2.0' సినిమా పనులతో బిజీగా వున్నారు. ఓ వైపున ఈ సినిమాను విడుదలకి సిద్ధం చేస్తూనే, మరో వైపున కమలహాసన్ తో 'భారతీయుడు' సినిమా సీక్వెల్ కి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పనులు కూడా చకచకా జరిగిపోతున్నాయి.

ఈ సినిమాలో కథానాయికగా నయనతారను తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో టీమ్ ఉందట. శంకర్ - కమల్ కాంబినేషన్ అంటే నయనతార తప్పకుండా అంగీకరిస్తుందనే టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే .. కమల్ తో నయనతార చేసే మొదటి సినిమా ఇదే అవుతుంది. లైకా ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. 'భారతీయుడు' సంచలన విజయం సాధించింది కనుక, సహజంగానే ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు వున్నాయి.    

  • Loading...

More Telugu News