Chandrababu: ప్రభుత్వ ప్రకటనలు ‘సాక్షి’కి ఇవ్వకండి: వర్ల రామయ్య

  • ఐ అండ్ పీఆర్ కమిషనర్ కు టీడీపీ నేత వర్ల రామయ్య వినతి
  • దళితుల అభివృద్ధికి సంబంధించిన వార్తలకు ‘సాక్షి’ ప్రాధాన్యమివ్వడం లేదు
  • దళితులకు, సీఎం చంద్రబాబుకు సాక్షి యాజమాన్యం క్షమాపణలు చెబితే ప్రభుత్వ ప్రకటనలివ్వాలి

దళితుల అభివృద్ధికి సంబంధించిన వార్తలకు ‘సాక్షి’ దినపత్రిక ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఏపీ టీడీపీ జనరల్ సెక్రటరీ వర్ల రామయ్య ఆరోపించారు. అందువల్ల, ఈ పత్రికకు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వకూడదని అన్నారు. దళితులకు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఆ పత్రిక యాజమాన్యం క్షమాపణలు చెప్పే వరకు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వవద్దని కోరారు. ఈ మేరకు సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ ఎస్.వెంకటేశ్వర్ కు ఈరోజు వినతి పత్రం సమర్పించారు.

  • Loading...

More Telugu News