ntr: ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాలో పూజా హెగ్డే!

  • త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 
  • కథానాయిక కోసం అన్వేషణ 
  • తెరపైకి పూజా హెగ్డే పేరు
  • త్వరలో రెగ్యులర్ షూటింగ్    

ఎన్టీఆర్ .. త్రివిక్రమ్ కాంబినేషన్లో ఒక సినిమా నిర్మించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చేనెలలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ ను తీసుకునే ఛాన్స్ ఉందనే టాక్ వినిపించింది. 'అజ్ఞాతవాసి' పరాజయంపాలు కావడం వలన, ఈ ప్రాజెక్టులో ఆమెకి చోటు ఇవ్వడానికి త్రివిక్రమ్ అంతగా ఆసక్తిని చూపడం లేదట.

కొంతమంది కథానాయికల పేర్లను పరిశీలించిన ఈ సినిమా టీమ్, పూజా హెగ్డే దగ్గర ఆగినట్టుగా సమాచారం. ఎన్టీఆర్ జోడీగా ఆమె అయితే కొత్తగా ఉంటుందనీ .. పాత్ర పరంగా కూడా తనే బాగా సెట్ అవుతుందనే అభిప్రాయాలు టీమ్ లో వ్యక్తమవుతున్నాయి. త్వరలో రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్న ఈ సినిమాకి, అనిరుథ్ సంగీతాన్ని సమకూర్చనున్నాడు.       

  • Loading...

More Telugu News