Pawan Kalyan: సత్యసాయి సమాధిని దర్శించుకున్న పవన్.. చిత్ర మాలిక!

  • ట్రస్ట్ సభ్యులు రత్నాకర్‌తో భేటీ
  • సత్యసాయి ఆరాధ్యనీయుడన్న పవర్ స్టార్
  • జిల్లా సమస్యలు, రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకున్న పవన్

అనంతపురం పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ ఈ రోజు ఉదయం ప్రశాంతి నిలయంలోని శాంతి‌భవన్‌లో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు రత్నాకర్‌తో భేటీ అయ్యారు. ఇరువురి మధ్య దాదాపు అర్థగంటకుపైగా చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. అనంతరం అక్కడి నుంచి సత్యసాయి సమాధిని దర్శించుకుని అక్కడే ఉన్న అత్యాధునిక ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, పుట్టపర్తి ఆసుపత్రి అనేక ప్రభుత్వాలకు ఆదర్శమని అన్నారు. తాను చెన్నైలో ఉన్నప్పుడే సత్యసాయి చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి తెలుసుకున్నానని, ప్రస్తుతం స్వయంగా చూశానని, ఇక్కడికి రావడం తన అదృష్టమని చెప్పారు.

ఇందుకు సంబంధించిన చిత్రాలు..

  • Loading...

More Telugu News