TRS: బీజేపీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారు.. టీఆర్ఎస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

  • బీజేపీది మాటల ప్రభుత్వమేనని జనాలకు అర్థమైంది
  • మూడున్నరేళ్లుగా హామీలే తప్ప చేతల్లేవు
  • మీడియాతో ఎంపీ జితేందర్ రెడ్డి

టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్, ఎంపీ జితేందర్ రెడ్డి కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వ తీరు అర్థమైందని పేర్కొన్నారు. బీజేపీ మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదని ఇప్పటికే జనాలకు తెలిసొచ్చిందని పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశం అనంతరం జితేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

మూడున్నరేళ్లుగా కేంద్రం హామీలతోనే సరిపెడుతోంది తప్ప చేతల్లో చూపించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక హామీలకు ఎంతమాత్రమూ శాంతించబోమని తేల్చి చెప్పారు. కేంద్రం నుంచి తెలంగాణకు రూ.5 వేల కోట్ల బకాయిలు రావాలని పేర్కొన్న జితేందర్ రెడ్డి.. ఈ బడ్జెట్‌లో తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. హైకోర్టు, బయ్యారం, స్టీల్‌ప్లాంట్, హార్టికల్చర్ వర్సిటీ, ఎయిమ్స్ నిధులపై ఈ బడ్జెట్ లో ప్రకటన వస్తుందని జితేందర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News