Chandrababu: ఏపీకి సన్ రైజ్ స్టేట్ నినాదం ఇచ్చింది అందుకే... చంద్రబాబు వివరణ

  • సూర్యుడే అతి పెద్ద బ్రాండ్ అంబాసిడర్
  • సూర్యారాధన అన్ని మతాల్లో ఉన్నదే
  • ప్రత్యేకంగా ఓ మతానికి సంబంధించినది కాదని వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు తీరంలో ఉండడంతో సూర్యుడు ఇక్కడి నుంచే ఉదయిస్తాడని, అందుకే సూర్యుడే ఈ రాష్ట్రానికి అతిపెద్ద బ్రాండ్ అంబాసిడర్ అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సన్ రైజ్ స్టేట్ అనే నినాదం ఇచ్చింది ఇందుకేనని చంద్రబాబు చెప్పారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ రోజు జరిగిన సూర్యారాధన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు.

సూర్యునికి అన్ని ప్రాంతాలు, మతాలలో ప్రాధాన్యత ఉందని చెప్పారు. అరబ్ దేశాల్లో సూర్యుడ్ని షమ్స్ పేరుతో ఆరాధించే సంస్కృతితోపాటు బైబిల్ లోనూ పేర్కొనడాన్ని తెలియజేశారు. సూర్యారాధన, జలహారతి, అమ్మకు వందనం కార్యక్రమాలు ప్రకృతి ఆరాధనలో భాగంగానే నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అంతేకానీ, సూర్యారాధన ఓ మతానికి సంబంధించినది కాదని, దీనిపై అపోహలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. సూర్యారాధన కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని వివిధ రకాల ఆసనాలు వేశారు.

  • Loading...

More Telugu News