keerthi suresh: 'మహానటి' ఆ రోజునే పక్కాగా వస్తుందట!

  • కీర్తి సురేశ్ ప్రధాన పాత్రగా 'మహానటి'
  • విడుదల తేదీ వాయిదా పడిందనడంలో వాస్తవం లేదు
  • మార్చి 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు

కల్యాణ్ రామ్ హీరోగా రూపొందుతోన్న 'ఎమ్మెల్యే' (మంచి లక్షణాలున్న అబ్బాయ్) ను, మార్చి 29వ తేదీన విడుదల చేయనున్నట్టు ఈ సినిమా టీమ్ ప్రకటించింది. అలాగే మార్చి 30వ తేదీన తమ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్టుగా 'రంగస్థలం' సినిమా టీమ్ ఎనౌన్స్ చేసింది.

 ఇక 'మహానటి' సినిమాను కూడా మార్చి 30వ తేదీనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి పనులు ఈ లోగా పూర్తి కాకపోవచ్చనీ, అందువలన ఆ తేదీన రిలీజ్ చేయడం కష్టమేననే టాక్ వచ్చింది. కానీ ఇదంతా కేవలం పుకారు మాత్రమేనని ఈ సినిమా టీమ్ చెబుతోంది. ఈ సినిమా విడుదల తేదీ విషయంలో ఎలాంటి మార్పులు లేవనీ, ముందుగా చెప్పినట్టుగానే మార్చి 30వ తేదీనే వస్తుందని స్పష్టం చేశారు. మొత్తానికి 'మహానటి' గట్టిపోటీకే రెడీ అవుతోందన్న మాట.   

  • Loading...

More Telugu News