Balakrishna: ఏపీలోని తుళ్ళూరు ప్రాంతంలో బసవతారకం ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తాం: నందమూరి బాలకృష్ణ

  • హైదరాబాద్ లోని బసవ తారకం ఆసుపత్రిలో గణతంత్ర వేడుకలు
  • జాతీయ జెండా ముందు ప్రజలంతా సమానమే
  • తుళ్ళూరు ప్రాంతంలో వచ్చే నెలలో శంకుస్థాపన: బాలకృష్ణ

ఏపీలోని తుళ్ళూరు ప్రాంతంలో వచ్చే నెలలో బసవతారకం ఆసుపత్రికి శంకుస్థాపన చేయనున్నట్టు టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ తెలిపారు. హైదరాబాద్ లోని బసవ తారకం కేన్సర్ ఆసుపత్రిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను బాలకృష్ణ ఎగురవేశారు. అనంతరం, ఆయన మాట్లాడుతూ, జాతీయ జెండా ముందు ప్రజలంతా సమానమేనని అన్నారు. దేశం గురించి మాట్లాడేటప్పుడు, స్ఫూర్తిని పంచుకునేటప్పుడు అతిథులు ఎవరూ ఉండరని, అందరూ ఆత్మీయులేనని అన్నారు.

  • Loading...

More Telugu News