Mahesh Babu: రేపు ఉదయం ఏడు గంటలకు మా ‘ఫస్ట్ ఓథ్’ వినండి!: దర్శకుడు కొరటాల శివ

  • ‘ఫస్ట్ ఓథ్’ పేరిట ఆడియో విడుదల చేస్తున్నాం
  • మీరందరూ విని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా
  • ట్విట్టర్లో వీడియో మెసేజ్ ఇచ్చిన కొరటాల శివ

డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ ప్రొడక్షన్ హౌస్ లో కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా 'భరత్ అనే నేను' పేరిట ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ‘ఫస్ట్ లుక్’ పై ఇప్పటికే అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కొరటాల ఆసక్తికర విషయం చెప్పారు. గణతంత్రదినోత్సవం సందర్భంగా ‘ఫస్ట్ ఓథ్’ పేరిట ఓ ఆడియోను విడుదల చేస్తున్నట్టు చెప్పారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేసిన ఓ వీడియోలో ఆయన మాట్లాడారు.

‘నేను కొరటాల శివ. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ ప్రొడక్షన్ హౌస్ లో మహేష్ బాబు గారితో నేను తీస్తున్న నెక్స్ట్ సినిమా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ కు సంబంధించిందని చాలా మందికి తెలుసు. మరీ ప్రత్యేకంగా, ఈ సినిమా గురించి చెప్పాలంటే, అన్ డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఒక ఫిక్షనల్ పొలిటికల్ డ్రామాగా ఈ స్టోరీ నడుస్తుంది. ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్ ప్రారంభించడానికి సరైన సందర్భం కోసం వేచి చూశాం. జనవరి 26.. రిపబ్లిక్ డే రోజు సరైన సమయమని మా చిత్రయూనిట్ అంతా భావించింది.

కనుక, ఈ రిపబ్లిక్ డే ఉదయం 7 గంటలకు ‘ఫస్ట్ ఓథ్’ పేరుతో ఒక ఆడియోను విడుదల చేస్తున్నాం. ఇలాంటి కథకు ఒక వీడియో కంటే ఆడియోను విడుదల చేస్తే మంచి ఇంపాక్ట్ ఉంటుందని అందరం భావించాం. అందుకని, అన్ని రేడియో ఛానెల్స్ , లీడింగ్ మ్యూజిక్ ప్లాట్ ఫామ్స్, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ఈ ఆడియోను విడుదల చేస్తున్నాం. మా ఈ ‘ఫస్ట్ ఓథ్’ను మీరందరూ విని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ..ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు’ అని ఆ వీడియోలో కొరటాల శివ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News