India: చివరి టెస్టు: దక్షిణాఫ్రికా స్కోరు 41/2

  • భువనేశ్వర్ కుమార్‌కి రెండు వికెట్లు
  • ప్రస్తుతం క్రీజులో రబాడా 11, ఆమ్లా 13
  • మార్కెల్ (2), ఎల్గర్ (4) ఔట్

జోహన్స్‌బర్గ్‌లో జ‌రుగుతోన్న చివరి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో నిన్న‌ టీమిండియా 187 పరుగులకు ఆలౌటైన విష‌యం తెలిసిందే. బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా ఓపెనర్ మార్కెల్ (2) నిన్న సాయంత్రమే ఔట్ కాగా, ఒక వికెట్‌ నష్టానికి 6 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో ఈ రోజు బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే దెబ్బ త‌గిలింది. 12.3వ ఓవర్‌ వద్ద  ఎల్గర్ 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరిగాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా స్కోరు 41/2 (22 ఓవర్లకి) గా ఉంది. ప్రస్తుతం క్రీజులో రబాడా 11, ఆమ్లా 13 పరుగులతో ఉన్నారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్‌కి రెండు వికెట్లు దక్కాయి.

  • Loading...

More Telugu News