bellamkonda: యంగ్ హీరోకి హీరోయిన్ ఇంకా ఖరారు కాలేదట!

  • ఓంకార్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ 
  • స్క్రిప్ట్ దశలో పనులు 
  • త్వరలో సెట్స్ పైకి  

ఒక వైపున మాస్ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేసిన బెల్లంకొండ శ్రీనివాస్, మరో వైపున ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆయన 'సాక్ష్యం' సినిమా చేస్తున్నాడు. వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా తరువాత ఆయన ఓంకార్ దర్శకత్వంలో ఒక మూవీ చేయనున్నాడు. నిర్మాతగా రాధామోహన్ వ్యవహరించనున్న ఈ సినిమాలో, కథానాయికగా కీర్తి సురేశ్ ను ఎంపిక చేసినట్టుగా ఇటీవల ప్రచారం జరిగింది. అయితే అందులో నిజంలేదనేది తాజా సమాచారం. ఈ ప్రాజెక్టు స్క్రిప్ట్ దశలోనే ఉందట. హీరోయిన్ ఎవరనేది ఇంకా అనుకోలేదనీ, త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ ఇస్తామని ఈ సినిమా యూనిట్ చెబుతోంది. 'రాజుగారి గది 2' తరువాత ఓంకార్ చేస్తోన్న ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి వుంది.  

  • Loading...

More Telugu News