balakrishna: తెలుగు రాష్ట్రాల్లో 'జై సింహా' 10 రోజుల వసూళ్లు

  • సంక్రాంతి కానుకగా వచ్చిన 'జై సింహా'
  • మాస్ ఆడియన్స్ మనసు దోచేసింది 
  • 10 రోజుల్లోనే సేఫ్ జోన్ లోకి

బాలకృష్ణ - కేఎస్ రవికుమార్ కాంబినేషన్లో రూపొందిన 'జై సింహా' .. సంక్రాంతి కానుకగా ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలకృష్ణ సరసన నయనతార .. నటాషా దోషి .. హరిప్రియ కథానాయికలుగా నటించిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల్లో భారీ వసూళ్లను సాధించింది.

 ప్రాంతాలవారీగా చూసుకుంటే, నైజామ్ లో 4.11 కోట్లు .. సీడెడ్ 5.30 కోట్లు .. నెల్లూరులో 1.23 కోట్లు .. గుంటూరులో 2.37 కోట్లు .. కృష్ణా 1.61 కోట్లు .. వెస్ట్ 2.04 కోట్లు .. ఈస్ట్ 2.44 కోట్లు .. వైజాగ్ లో 3.44 కోట్లు .. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 22.54 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ వసూళ్లతో డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్ లోకి వెళ్లినట్టు చెబుతున్నారు. మాస్ ఆడియన్స్ కి కావలసిన అన్ని రకాల అంశాలను జోడించడం వల్లనే ఈ సినిమాకి ఈ స్థాయిలో వసూళ్లు లభించాయనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.  

  • Loading...

More Telugu News