BJP: అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం.. వైసీపీ ఎమ్మెల్యేతో కలిసి బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ప్రెస్‌మీట్‌

  • చర్చనీయాంశంగా మారిన వైసీపీ, బీజేపీ నేతల ప్రెస్‌మీట్‌
  • వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి మంత్రులుగా ఉన్న వారంతా రాజీనామా చేయాలి-విష్ణుకుమార్‌ రాజు
  • లేకపోతే పార్టీ ఫిరాయించిన వారు మంత్రులు కావచ్చని చట్టం తేవాలి

బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ఈ రోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి పక్కనే కూర్చొని విష్ణుకుమార్ రాజు మీడియాతో మాట్లాడారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి మంత్రులుగా ఉన్న వారంతా రాజీనామా చేయాలని అన్నారు. లేకపోతే పార్టీ ఫిరాయించిన వారు మంత్రులు కావచ్చని చట్టం తేవాలని చురకలంటించారు.

కాగా, ఇటీవలే వైసీపీ అధినేత జగన్ ఓ జాతీయ చానెల్‌తో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తాము బీజేపీతో కలిసి పనిచేయడానికి సిద్ధమంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై చర్చ జరుగుతోన్న నేపథ్యంలో బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొనడం ఆసక్తికరంగా మారింది.

  • Loading...

More Telugu News