Chandrababu: సీఎం కుర్చీలో కూర్చున్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ!

  • విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో హిందూపురం నియోజకవర్గంపై సమీక్ష
  • చంద్రబాబు కుర్చీలో కూర్చున్న బాలకృష్ణ
  • ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి దేవినేని, అధికారులు

విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో హిందూపురం నియోజకవర్గ సమీక్షా సమావేశాన్ని ఎమ్మెల్మే నందమూరి బాలకృష్ణ ఈరోజు నిర్వహించారు. లేపాక్షి పుస్తకాల అంశంపై నిర్వహించిన ఈ సమీక్షలో ఓ ఆశ్చర్యకర సంఘటన చోటుచేసుకుంది. సీఎం చంద్రబాబునాయుడి కుర్చీలో బాలకృష్ణ కూర్చుని ఈ సమావేశం నిర్వహించడంపై విమర్శలు తలెత్తాయి. ఈ సమావేశంలో మంత్రి దేవినేని ఉమ, ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో సామాజిక మాధ్యమంలో దర్శనమిచ్చింది. అయితే, సచివాలయం సిబ్బంది మాత్రం చంద్రబాబు ఉపయోగించే కుర్చీని పక్కకు జరిపి, వేరే కుర్చీలో బాలయ్య కూర్చున్నారని చెబుతున్నారు. కాగా, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News