India: ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా

  • జోహన్స్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాతో చివరిటెస్టు
  • టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తోన్న టీమిండియా
  • ప్రస్తుత స్కోరు 47/2 (29 ఓవర్లకి)

భారత్, దక్షిణాఫ్రికా మధ్య చివరి టెస్టు మ్యాచ్ జోహన్స్‌బర్గ్‌లో కొనసాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. లోకేశ్ రాహుల్ డకౌట్ కాగా, మురళీ విజయ్ 8 పరుగుల వ్యక్తిగత స్కోరుకే వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో భారత సారథి విరాట్‌ కోహ్లీ 24, ఛటేశ్వర్ పుజారా 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 47/2 (29 ఓవర్లకి) గా ఉంది. ఇప్పటికే మొదటి రెండు టెస్టుల్లో ఓడిపోయిన టీమిండియా చివరి టెస్టులోనయినా గెలవాలని పట్టుదలతో ఉంది.

  • Loading...

More Telugu News