అదే జరిగితే బీజేపీతో జగన్ రహస్య ఒప్పందం నిజమైనట్టే!: ఉండవల్లి అరుణ్ కుమార్
- జాతీయ చానల్ తో జగన్ వ్యూహాత్మకంగా మాట్లాడారు
- ఎన్నికల్లోపు ప్రత్యేక హోదా వస్తే, రహస్య ఒప్పందం ఆరోపణలు నిజమైనట్టే
- జగన్, బీజేపీ కలిస్తే మంచో, చెడో కాలమే నిర్ణయిస్తుంది
- మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్
ఇక జగన్, బీజేపీ కలిస్తే, ఏపీకి మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా? అన్న విషయాన్ని కాలమే నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీతో కలవలేని పరిస్థితిలో జగన్ ఉన్నాడని తెలిపిన ఆయన, ఆ పరిస్థితి కాంగ్రెస్ అధిష్ఠానం వైఖరి వల్లే వచ్చిందని వెల్లడించారు. విభజన హామీలు అమలు కావడం లేదని, అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తరువాత చంద్రబాబు తెలుసుకున్నారని, ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళతానంటున్న ఆయన, ముందు రాష్ట్రానికి అన్యాయం ఎవరు చేశారన్న విషయాన్ని తేటతెల్లం చేయాలని డిమాండ్ చేశారు.