Nagarjuna: నా ఫోన్ లో నాన్నకు తీసిన చివరి ఫొటో ఇది!: అక్కినేని నాగార్జున

  • మీరు మమ్మల్ని వదిలిపెట్టి నాలుగేళ్లు అవుతుంది
  • మీ గురించి మేమందరం ఆలోచిస్తూనే ఉన్నాం
  • ఓ ట్వీట్ లో నాగార్జున

అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి చిత్రం ‘మనం’. తన కుమారుడు నాగార్జున, కోడలు అమల, మనవళ్లు నాగచైతన్య, అఖిల్ తో కలిసి నటించిన ఏఎన్ ఆర్ చివరి చిత్రం 2014 మేలో విడుదలై రికార్డులు సృష్టించింది. ఈ సినిమా అప్పటికే అక్కినేని ఆరోగ్యం క్షీణించడం, సినిమా విడుదలకు ముందే ఆయన మృతి చెందడం తెలిసిందే.

కాగా, తాజాగా ఈ సినిమా గురించి ప్రస్తావించిన నాగార్జున, తన ఫోన్ లో తన తండ్రికి తీసిన చివరి ఫొటో గురించి గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు నాగ్ ఓ ట్వీట్ చేశారు. ‘మీరు మమ్మల్ని వదిలిపెట్టి నాలుగేళ్లు అవుతుంది. కానీ, మీ గురించి మేమందరం ఆలోచిస్తూనే ఉన్నాం..’ అని పేర్కొన్నారు. ‘నాన్నకు నా ఫోన్ లో చివరిసారిగా తీసిన ఫొటో ఇది’ అంటూ ఆ ఫొటోను, ‘మనం’లో ఓ పోస్టర్ ను ఈ సందర్భంగా నాగార్జున పోస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News