Hyderabad: ఏసీబీ మహిళా ఏఎస్పీతో సీఐ వివాహేతర బంధం... పట్టుకుని చితక్కొట్టిన బంధువులు... వీడియో!

  • కేపీహెచ్బీ కాలనీలో కలకలం
  • రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త, బంధువులు
  • చెప్పులతో కొట్టిన ఏఎస్పీ తల్లి, అత్త
  • ఉన్నతాధికారుల సీరియస్

ఇద్దరు పోలీసు అధికారుల మధ్య వివాహేతర బంధం బట్టబయలై, హైదరాబాద్, కేపీహెచ్బీ కాలనీలో కలకలం రేపింది. తన భార్యతో కల్వకుర్తి సీఐ మల్లికార్జున్ రెడ్డి అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ, ఏసీబీ విభాగంలో ఏఎస్పీగా పనిచేస్తున్న అధికారిణి భర్త, తన బంధువులతో కలిసొచ్చి దాడికి దిగాడు. ఓ ఇంట్లో తన భార్యను, సీఐని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఆయన, నడిరోడ్డుపైనే సీఐని చితక్కొట్టాడు. ఏఎస్పీ తల్లి, అత్త మల్లికార్జున్ రెడ్డిని చెప్పులతో కొట్టారు. ఈ మొత్తం వ్యవహారమంతా టీవీ చానల్ కెమెరాలకు చిక్కింది.

ఇక ఈ విషయం గురించి తెలుసుకున్న ఉన్నతాధికారులు ఏఎస్పీ, సీఐల వైఖరిపై సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. తన భార్యను సీఐ ట్రాప్ చేశాడని, గత రెండేళ్లుగా వారిద్దరి మధ్యా సంబంధం ఉందని ఏఎస్పీ భర్త ఆరోపించాడు. తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని, అయితే తన భార్య బాగోతం బయట పెట్టాలనే ఉద్దేశంతోనే వారిని పట్టుకున్నానని తెలిపాడు. వీరిద్దరి పైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News