mohanbabu: మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలకు కారణం ఇదే: సీపీఐ నేత రామకృష్ణ

  • ఏపీకి తీరని అన్యాయం జరుగుతోంది
  • చంద్రబాబు, వెంకయ్యలే దీనికి కారణం
  • నాయకుల్లో అవినీతి వల్లే మోహన్ బాబు వ్యాఖ్యలు

విభజన హామీల విషయంలో ఏపీకి తీరని అన్యాయం జరుగుతోందని, దీనికంతటికీ కారణం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబులేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆరోపించారు. తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎన్డీఏ నుంచి బయటకు రావాలని అన్నారు. రాజకీయ నేతల్లో రాస్కెల్స్ ఉన్నారంటూ నటుడు మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలపై కూడా రామకృష్ణ స్పందించారు. అవినీతి, అక్రమాల్లో నాయకులు కూరుకుపోవడం వల్లే మోహన్ బాబు ఈ వ్యాఖ్యలు చేశారని అన్నారు.

mohanbabu
Chandrababu
Venkaiah Naidu
cpi ramakrishna
  • Loading...

More Telugu News