accident: హైద‌రాబాద్‌లో లారీ బీభత్సం... ఇద్దరి మృతి

  • వ‌న‌స్థ‌లి పురంలోని సుష్మా థియేట‌ర్ ప్రాంతంలో ఘ‌ట‌న‌
  • రెండు ఆటోలు, ఓ బైక్‌ను ఢీ కొన్న లారీ
  • మరో ఇద్దరికి గాయాలు 
  • ఆసుపత్రికి తరలింపు

హైద‌రాబాద్‌లోని వ‌న‌స్థ‌లిపురం సుష్మా థియేట‌ర్ ప్రాంతంలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఆ ప్రాంతంలో రోడ్డుపై వెళుతోన్న ఓ లారీ ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపక్కకు దూసుకొచ్చి రెండు ఆటోలు, ఓ బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, మృత దేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయాల పాలయిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News