bengalore: అమ్మాయితో క‌లిసి బైకుపై వెళుతున్నందుకు.. ప‌ట్టుకుని చావ‌గొట్టిన యువ‌కులు.. సీసీ కెమెరాలో దృశ్యాలు

  • బెంగళూరులో మరో దారుణ ఘటన
  • అడ్డువచ్చినందుకు రచ్చ రచ్చ చేసిన పోకిరీలు
  • ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
  • సీసీ కెమెరాల ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు

నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల నాడు రోడ్ల‌పై బెంగ‌ళూరు యువ‌కులు చేసే హల్‌చ‌ల్ అంతా ఇంతా కాదు. వీధుల్లో వికృతంగా నృత్యాలు చేయ‌డ‌మే కాకుండా అడ్డం వ‌చ్చిన వారిని చిత‌క‌బాది పంపారు. రోడ్ల‌పై అమ్మాయిల‌ను హింసిస్తూ చాలా సార్లు పోలీసుల‌కు కూడా చిక్కారు.

 ఈ క్రమంలో డిసెంబర్ 31 రాత్రి రోడ్ల‌పై అక్క‌డి యువ‌కులు చేసిన పోకిరీ చేష్ట‌లు ఆల‌స్యంగా వెలుగులోకొచ్చాయి. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా ఈ రోజు ప‌లువురు యువకులపై కేసులు న‌మోదు చేసిన‌ పోలీసులు ఆ వీడియోను మీడియాకు ఇచ్చారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఓ గ్రూపు నడి రోడ్డుపై ఎంజాయ్ చేస్తోంది. ఆ దారిలో ఓ బైకుపై ఇద్ద‌రు యువ‌కులు, ఓ అమ్మాయి వెళుతుండ‌గా వారిని ప‌ట్టుకుని చిత‌క్కొట్టారు.  

bengalore
youngsters
attacked
  • Error fetching data: Network response was not ok

More Telugu News