India: వర్షం ఆగింది.. ఆట మొదలైంది.. అర్ధ శతకం బాదిన డివిల్లియర్స్!

  • దక్షిణాఫ్రికా స్కోరు 90/2 (29 ఓవర్లకి)
  • బుమ్రాకి రెండు వికెట్లు
  • క్రీజులో ఎల్గర్ 36, డివిల్లియర్స్ 50

సెంచూరియన్లో జరుగుతోన్న భారత్‌-దక్షిణాఫ్రికా టెస్టుకి వరుణుడు అంతరాయం కలిగించిన విషయం తెలిసిందే. వర్షం ఆగడంతో టెస్టు మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. ధాటిగా ఆడిన ఏబీ డివిల్లియర్స్ అర్ధ సెంచరీ చేశాడు. దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ లో మార్కమ్ 1, ఆమ్లా 1, పరుగులు చేసి అవుటయ్యారు. ప్రస్తుతం క్రీజులో ఎల్గర్ 36, డివిల్లియర్స్ 50 పరుగులతో ఉన్నారు. టీమిండియా బౌలర్లలో జస్ప్రిత్ బుమ్రాకి రెండు వికెట్లు దక్కాయి. దక్షిణాఫ్రికా స్కోరు 90/2 (29 ఓవర్లకి) గా ఉంది. మొదటి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 335 పరుగులు చేసి ఆలౌట్ కాగా, భారత్ 307 పరుగులకే ఆలౌటైంది.

  • Loading...

More Telugu News