ntr: ‘ఎన్టీఆర్’ బయోపిక్ ను త్వరలోనే ప్రారంభిస్తాం: సినీ నటుడు బాలకృష్ణ

  • తిరుపతిలో సందడి చేసిన బాలయ్య
  • అభిమానులతో కలిసి ‘జై సింహా’ తిలకించిన నేత
  • ప్రేక్షకులు నాకు అందించిన విజయకానుక ‘జైసింహా’: బాలకృష్ణ

హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ హీరో బాలకృష్ణ తిరుపతిలో సందడి చేశారు. ఇక్కడి గ్రూపు థియేటర్ లో బాలకృష్ణ నటించిన ‘జైసింహా’ చిత్రం ఆడుతోంది. బాలకృష్ణ తన అభిమానులతో కలిసి ఈ సినిమాను తిలకించారు. అనంతరం, బాలకృష్ణ  మీడియాతో మాట్లాడుతూ, ప్రేక్షకులు ఎప్పుడూ తమ వెంటే ఉంటారని, సంక్రాంతి పండగకు ప్రేక్షకులు తనకు అందించిన విజయకానుక ‘జైసింహా’ అని అన్నారు. ఈ సందర్భంగా ‘ఎన్టీఆర్’ బయోపిక్ గురించి ప్రస్తావిస్తూ, త్వరలోనే ఈ సినిమాను ప్రారంభించనున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News