Hyderabad: రూ. 500 ఇస్తే మీ ఇష్టం... హైదరాబాద్ పార్కుల్లో పాడు పనులు... లవర్స్ కోసం సీక్రెట్ ప్లేస్ లు చూపిస్తున్న సెక్యూరిటీ!

  • సెక్యూరిటీ గార్డుల సహాయం
  • వాలిపోతున్న ప్రేమ పక్షులు
  • సాధారణ ప్రజలకు ఇబ్బందులు

హైదరాబాద్ లోని ఇందిరా పార్కు, సంజీవయ్య పార్కు, దుర్గం చెరువు... ఈ ప్రాంతాల్లో సందర్శకుల మాట ఎలా ఉన్నా, సెక్యూరిటీ గార్డుల ప్రోత్సాహంతో సాయంత్రానికి ఎక్కడెక్కడి నుంచో ప్రేమ పక్షులు వాలిపోయి, సినిమాల్లో కనిపించని రొమాంటిక్ సీన్లను చూపిస్తున్నాయి. హోటళ్లపై పోలీసుల నిఘా ఎక్కువగా ఉండటంతో, లవర్స్ పార్కులను ఆశ్రయిస్తుండగా, వారి నుంచి చేతికి అందినంత డబ్బులు వసూలు చేస్తున్న సెక్యూరిటీ గార్డులు సీక్రెట్ ప్లేస్ లను చూపిస్తున్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలో ఎవరికీ కనిపించని పొదల మాటు ప్రాంతాన్ని చూపి, ఓ గంట పాటు అటు ఎవరినీ రాకుండా చూసుకోవాలంటే రూ. 500, ఆపై చాటుగా ఉండే స్థలాలైతే రూ. 50 నుంచి రూ. 200 వరకూ సెక్యూరిటీ గార్డులు వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా రెండు వైపులా రహదారి ఉండే వెంగళ్ రావు పార్కులో సాయంత్రమైతే వచ్చి చేరే యువతీ యువకులు, రాత్రి చీకటి పడే వరకూ తమ కోరికలను తీర్చుకుంటున్న పరిస్థితి. రాత్రి 11 గంటల వరకూ కూడా వీరు పార్కులను వదిలి వెళ్లడం లేదని, కుటుంబంతో కలసి వచ్చే తమకు చాలా ఇబ్బందిగా ఉంటోందని ప్రజలు ఆరోపిస్తున్నా వారి ఫిర్యాదులను పట్టించుకునే వారు లేరన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  • Loading...

More Telugu News