Mahesh Babu: సంక్రాంతికి 'భరత్ అనే నేను' ఫస్టులుక్ లేనట్టే!

  • షూటింగు దశలో 'భరత్ అనే నేను'
  • కథానాయికగా కైరా అద్వాని 
  • ఏప్రిల్ 27న తేదీన విడుదల

కొరటాల శివ దర్శకత్వంలో .. మహేశ్ బాబు కథానాయకుడిగా 'భరత్ అనే నేను' సినిమా తెరకెక్కుతోంది. కైరా అద్వాని కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ వస్తుందని ఆశించిన అభిమానులకి నిరాశే ఎదురైంది. సంక్రాంతికి ఫస్టులుక్ ను రిలీజ్ చేయవచ్చని వాళ్లు భావించారు. కానీ సంక్రాంతికి కూడా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ రావడం లేదని సమాచారం. వచ్చే నెలలో ఫస్టులుక్ ను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఈ సినిమాను ఏప్రిల్ 27వ తేదీన విడుదల చేయనున్నారు. రిలీజ్ కి చాలా సమయం ఉండగా .. ఇప్పటి నుంచే ప్రమోషన్స్ ఎందుకని ఫస్టులుక్ ను వదలడం లేదట.      

  • Loading...

More Telugu News