gopichand: గోపీచంద్ మూవీ టైటిల్ మారే ఛాన్స్ ..అదీ సెంటిమెంట్ కి కట్టుబడే!

  • షూటింగ్ దశలో గోపీచంద్ 25వ మూవీ 
  • ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తి 
  • కథానాయికగా మెహ్రీన్

ఫ్యామిలీ ఆడియన్స్ ను .. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే కథలనే గోపీచంద్ ఎంచుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన 25వ సినిమాను చేస్తున్నాడు. కేకే రాధామోహన్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి చక్రి దర్శకత్వం వహిస్తున్నాడు. మెహ్రీన్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే 50 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది.

గోపీచంద్ తన సినిమాలకు చాలావరకూ సున్నాతో పూర్తయ్యే టైటిల్స్ ను ఎంపిక చేసుకుంటూ ఉంటాడు .. అది ఆయనకు సెంటిమెంట్. అలా ఈ సినిమాకు 'పంతం' అనే టైటిల్ అనుకున్నారు. అయితే ఇదేదో డబ్బింగ్ సినిమా టైటిల్ లా ఉందనే అభిప్రాయాలు ఎక్కువ కావడంతో, 'శపథం' అయితే ఎలా వుంటుందనే ఆలోచన చేస్తున్నారట. దాదాపు ఈ టైటిల్ ఖరారు కావొచ్చని అంటున్నారు. ఈ సినిమా అయినా గోపీచంద్ కి హిట్ ఇస్తుందేమో చూడాలి.     

  • Loading...

More Telugu News