Balakrishna: బాలయ్య అభిమానులకు పెద్ద పండగ ...‘జై సింహా’కు ఐదు రోజుల పాటు ప్రత్యేక షోలకు అనుమతి!

  • రేపటి నుంచి 16 వ తేదీ వరకు 24X7 ప్రత్యేక ప్రదర్శనలు
  • తెల్లవారుజామున ఒంటి గంట నుంచి ఉదయం 10 గంటల వరకు ప్రత్యేక షోలు
  • ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు  

కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందిన ‘జై సింహా’ చిత్రం రేపు విడుదల కానుంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. కాగా, ఈ చిత్రం ప్రత్యేక ప్రదర్శనలకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. రేపటి నుంచి ఈ నెల 16వ తేదీ వరకు ‘జై సింహా’ సినిమాను 24X7 ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించుకునేందుకు అనుమతిస్తున్నట్టు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఈ ప్రత్యేక ప్రదర్శనలు తెల్లవారుజామున ఒంటి గంట నుంచి ఉదయం 10 గంటల వరకు నిర్వహించాలని, ప్రేక్షకుల రద్దీ, బ్లాక్ టికెట్ల అమ్మకాలు ఎక్కువవుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, ‘జై సింహా’ ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతించాలని కోరుతూ సీకే ఎంటర్ టైన్ మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధిత శాఖకు ఇటీవల ఓ వినతిపత్రం సమర్పించింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News