Uttar Pradesh: బంధువు ఇంట్లో భోజ‌నం చేసిన తొమ్మిది మంది అనుమానాస్ప‌ద‌ మృతి!

  • లక్నోలోని థాల్‌ ఖుర్ద్‌ గ్రామంలో ఘ‌ట‌న‌
  • భోజ‌నానికి పిలిచి విషం పెట్టి చంపిన వ్య‌క్తి?
  • ద‌ర్యాప్తు చేస్తోన్న పోలీసు‌లు

ఉత్తరప్ర‌దేశ్ రాజ‌ధాని లక్నోలోని థాల్‌ ఖుర్ద్‌ గ్రామంలో విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. బంధువు ఇంటికి భోజనానికి వెళ్లిన తొమ్మిది మంది వ్య‌క్తులు క‌డుపు నిండా తిని ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న‌పై అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆ తొమ్మిది మందిలో ఎనిమిది మంది అస్వస్థతకు గురై, ఒకరు గుండెపోటుకు గురై  ప్రాణాలు కోల్పోయారు.

వారిని భోజనానికి పిలిచిన వ్యక్తి ఈ విష‌యాన్ని పోలీసులకు కూడా తెల‌ప‌లేదు. ఆయ‌న‌ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండ‌గా ఈ విష‌యం గురించి పోలీసులకు అజ్ఞాత‌వ్య‌క్తి నుంచి స‌మాచారం అందింది. ఆ వ్యక్తే విషం పెట్టి హ‌త్య చేశాడా? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. తొమ్మిది మంది మృత‌దేహాల‌ను శ‌వ‌ప‌రీక్ష‌ల నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

  • Loading...

More Telugu News