Pawan Kalyan: నైజామ్ లో అదరగొట్టేస్తోన్న 'అజ్ఞాతవాసి' వసూళ్లు

  • నిన్ననే విడుదలైన 'అజ్ఞాతవాసి'
  • నైజామ్ లో 27 కోట్లకి అమ్ముడైన హక్కులు 
  • తొలిరోజునే 5.40 కోట్ల షేర్
  • వసూళ్లు పెరిగే ఛాన్స్  

పవన్ కల్యాణ్ 'అజ్ఞాతవాసి' నిన్ననే ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కీర్తి సురేశ్ .. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాలో, ఖుష్బూ ఒక కీలకమైన పాత్రను పోషించింది. కథా కథనాలను నడిపించడంలో .. పాత్రలను మలచడంలో త్రివిక్రమ్ కంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వుంది. ఇక పవన్ స్టైల్ గురించి అందరికీ తెలిసిందే.

అందువలన ఈ సినిమా విడుదలైన ప్రతి చోటున భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. సహజంగానే నైజామ్ లో పవన్ సినిమాలకి మంచి క్రేజ్ వుంది. అందువలన ఆయన సినిమాలు ఇక్కడ మంచి వసూళ్లను రాబడుతూ ఉంటాయి. ఆ కారణంగా ఈ సినిమా హక్కులు అక్కడ 27 కోట్లకి అమ్ముడు కాగా, నిన్న ఒక్క రోజునే 5.40 కోట్ల షేర్ ను వసూలు చేసినట్టు సమాచారం. 17వ తేదీ వరకూ రోజుకు  5 షోల ప్రదర్శనకు అనుమతి ఉండటం .. వచ్చేవి సెలవులు కావడం కలిసొచ్చే అంశాలని అంటున్నారు. 

  • Loading...

More Telugu News