Mahesh Babu: ఫారిన్ నుంచి వచ్చేసిన మహేశ్ బాబు.. తిరిగి షూటింగు!

  • కొరటాల దర్శకత్వంలో 'భరత్ అనే నేను' 
  • తాజా షెడ్యూల్ ఈ రోజు నుంచి 
  • ఏప్రిల్ 27న భారీ స్థాయి రిలీజ్  

కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ బాబు 'భరత్ అనే నేను' సినిమా చేస్తున్నాడు. ఆమధ్య ఈ సినిమా తమిళనాడు - కరైకుడిలో ఒక షెడ్యూల్ షూటింగును పూర్తి చేసుకుంది. ఆ తరువాత క్రిస్మస్ .. న్యూ ఇయర్ సందర్భంగా మహేశ్ బ్రేక్ తీసుకుని విదేశాలకు వెళ్లాడు. అక్కడ ఫ్యామిలీతో సరదాగా గడిపిన మహేశ్ బాబు, మొన్ననే అక్కడి నుంచి వచ్చాడు.

 ఈ సినిమా తాజా షెడ్యూల్ ఈ రోజు నుంచి హైదరాబాద్ లో మొదలవుతోంది. ఈ షెడ్యూల్ లో మహేశ్ బాబుతో పాటు ముఖ్యతారాగణం పాల్గొననున్నారు. వీళ్ల కాంబినేషన్లో కొన్ని కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఈ సినిమా నుంచి న్యూ ఇయర్ గిఫ్ట్ గా ఫస్టులుక్ వస్తుందనుకున్నారు గానీ రాలేదు. సంక్రాంతికి రిలీజ్ చేసే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది. ఏప్రిల్ 27వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.  

  • Loading...

More Telugu News