Chandrababu: 'మీరు చాలా ట్రెండీగా ఉంటారు సార్' అన్న విద్యార్థిని.. చిరునవ్వు చిందించిన సీఎం!

  • విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవంలో విద్యార్థులతో ముఖాముఖి  
  • ‘సమర్థుడైన ముఖ్యమంత్రి’
  • ‘విద్యార్థినులతో ముఖాముఖి’లో చంద్రబాబుపై ప్రశంసలు

‘సార్, మీరు చాలా ట్రెండీగా ఉంటారు’ అంటూ ఏపీ సీఎం చంద్రబాబుపై ఓ విద్యార్థిని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో బాబు సహా అక్కడ ఉన్న వారందరూ చిరునవ్వులు చిందించారు. నెల్లూరు జిల్లాలోని కాకుటూరులో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవానికి చంద్రబాబు నిన్న హాజరయ్యారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఓ విద్యార్థిని చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. ‘మీరు ఇచ్చిన సైకిళ్ల వల్ల ఎంతోమంది అమ్మాయిలు తమ చదువును కొనసాగిస్తున్నారు. అన్ని తరగతుల బాలికలకు కూడా ఈ సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది. మీరు చాలా ట్రెండీగా ఉంటారు సార్’ అని ఆ విద్యార్థిని అనడంతో చంద్రబాబు సహా అందరూ నవ్వులు చిందించారు.

 ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ విధానం బాగుందని,  విద్యోన్నతి పథకం ఎంతో ప్రయోజనకరంగా ఉందని ఈ సందర్భంగా చంద్రబాబును ప్రశంసించారు. రాష్ట్రానికి సమర్థుడైన ముఖ్యమంత్రి లభించడం తమకు సంతోషంగా ఉందని, సమస్యల పరిష్కారానికి పట్టువీడని పోరాటం చేస్తున్న చంద్రబాబును గ్రీకు వీరుడు అలెగ్జాండర్ తో అభివర్ణిస్తూ ఆయా విద్యార్థినులు ప్రశంసించడం గమనార్హం.

  • Loading...

More Telugu News