balakrishna: 3 గంటల సినిమాగా 'జై సింహా' .. ప్రకాశ్ రాజ్ కూతురుగా నయనతార!

  • బాలకృష్ణ తాజా చిత్రంగా 'జై సింహా'
  • నయనతార పాత్ర హైలైట్ 
  • జనవరి 12న విడుదల

బాలకృష్ణ .. కె.ఎస్. రవికుమార్ కాంబినేషన్లో రూపొందిన 'జై సింహా' .. సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన కథానాయికలుగా నయనతార .. నటాషా దోషి .. హరిప్రియ అలరించనున్నారు.

ఈ సినిమా నిడివి 2 గంటల 43 నిమిషాలు అని సమాచారం. అంటే ఇంటర్వెల్ తో కలుపుకుంటే ఇది 3 గంటల సినిమా. నిడివి ఎక్కువైనా బోర్ కొట్టేలా ఉండదనీ .. అప్పుడే అయిపోయిందా? అనేలా ఉంటుందని ఈ సినిమా టీమ్ చెబుతోంది. ఇంటర్వెల్ తరువాత వచ్చే బాలకృష్ణ - ప్రకాశ్ రాజ్ కాంబినేషన్లోని సీన్స్ అదరహో అనేలా వుంటాయని అంటున్నారు. ఉత్కంఠభరితులను చేసే ఈ సీన్స్, సినిమాను ఎక్కడికో తీసుకువెళతాయని చెబుతున్నారు. ప్రకాశ్ రాజ్ కూతురు పాత్రలో నయనతార కనిపిస్తుందనీ, ఈ సినిమా హైలైట్స్ లో ఆమె పాత్ర ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు.   

  • Loading...

More Telugu News