surya: సూర్య తాజా చిత్రంలో రకుల్, సాయిపల్లవి!

  • సూర్య 36వ సినిమా మొదలు 
  • ఒక కథానాయికగా సాయిపల్లవి 
  • మరో కథానాయికగా రకుల్  

సూర్య కథానాయకుడిగా తెరకెక్కిన 'తానా సెరిందా కూట్టమ్' (గ్యాంగ్) చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగులోను సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, తన తదుపరి సినిమాను సూర్య మొదలుపెట్టేశాడు. సూర్య కెరియర్లో 36వ సినిమా ఇది. ఈ సినిమాకి సెల్వ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇందులో సూర్య సరసన కథానాయికగా రకుల్ ను తీసుకోనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తరువాత సాయిపల్లవిని ఎంపిక చేసుకున్నట్టుగా ప్రకటించారు. దాంతో రకుల్ ఛాన్స్ మిస్ అయిందని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమాలో రకుల్ కూడా ఉందనేది తాజా సమాచారం. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కి అవకాశం ఉందట .. దాంతో రకుల్ ను .. సాయి పల్లవిని తీసుకున్నారు. ఈ సినిమాను దీపావళికి విడుదల చేయనున్నట్టు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News