Allu Arjun: నా దృష్టిలో ఆమిర్ ఖాన్ తరువాత అల్లు అర్జునే!: 'నా పేరు సూర్య' నిర్మాత

  • అల్లు అర్జున్ ఎంతో కష్టపడుతున్నారు 
  • 70 శాతం చిత్రీకరణ జరుపుకుంది 
  • మరో 40 రోజుల్లో అన్ని పనులు పూర్తవుతాయి         

వక్కంతం వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా 'నా పేరు సూర్య' చిత్రం తెరకెక్కుతోంది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఫస్టు ఇంపాక్ట్ ను రిలీజ్ చేశారు. 29 గంటల్లో ఈ ఫస్టు ఇంపాక్ట్ ను 'కోటి'మందికి పైగా వీక్షించడం పట్ల నిర్మాత లగడపాటి శ్రీధర్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. "ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఎంతో కష్టపడుతున్నారు. అన్ని విషయాలను దగ్గరుండి చూసుకుంటున్నారు. సినిమా సినిమాకి ఆయన తన హార్డ్ వర్క్ ను పెంచుతూ వెళుతున్నారు"

"సినిమా పర్ఫెక్ట్ గా రావడం కోసం బాలీవుడ్ లో ఇంతగా శ్రమించేది .. ఆమిర్ ఖాన్. ఆయన తరువాత అంతగా తపించేది అల్లు అర్జునే అనేది నా అభిప్రాయం. దేశభక్తితో పాటు అల్లు అర్జున్ సినిమా నుంచి అభిమానులు ఆశించే అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. ఇంతవరకూ 70 శాతం చిత్రీకరణ జరుపుకుంది. మరో 40 రోజుల్లో అన్ని పనులు పూర్తవుతాయి. ఏప్రిల్ 27వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నాం" అని చెప్పారు.  

  • Loading...

More Telugu News