Balakrishna: 'జై సింహా' సినిమాకి సెకండాఫ్ హైలైట్ అట!

  • విడుదలకి ముస్తాబవుతోన్న 'జై సింహా' 
  • ఆహ్లాదకరంగా వుండనున్న ఫస్టాఫ్ 
  • ఉత్కంఠభరితంగా సెకండాఫ్    

బాలకృష్ణ 102వ సినిమాగా 'జై సింహా' భారీస్థాయిలో రూపొందింది. కె.ఎస్. రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, సంక్రాంతి కానుకగా ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి నిర్మాత సి. కల్యాణ్ మాట్లాడుతూ, ఈ సినిమా ఫస్టాఫ్ ఆసక్తికరంగా .. ఆహ్లాదకరంగా కొనసాగుతుందని చెప్పారు.

ఇక సెకండాఫ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అన్నారు. సెకండాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఉత్కంఠభరితంగా వుంటాయని చెప్పారు. వైజాగ్ నేపథ్యంలో కొనసాగే ఈ సన్నివేశాలు బాలయ్య అభిమానులచే విజిల్స్ వేయించేలా వుంటాయని అన్నారు. బాలకృష్ణ యాక్షన్ .. పవర్ఫుల్ డైలాగ్స్ ఈ సినిమాను ఓ స్థాయిలో నిలబెడతాయనీ, నయనతార .. నటాషా దోషి .. హరిప్రియ గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పుకొచ్చారు.    

  • Loading...

More Telugu News