nithin: దిల్ రాజు సినిమా కోసం రెడీ అవుతోన్న యంగ్ హీరో

  • నితిన్ తాజా చిత్రంగా 'గుర్తుందా శీతాకాలం'
  • తదుపరి చిత్రంగా 'శ్రీనివాస కల్యాణం'
  • కథానాయికగా పూజా హెగ్డే  

'లై' సినిమా యూత్ కి ఎంతమాత్రం కనెక్ట్ కాకపోవడంతో డీలాపడిపోయిన నితిన్, ఆ వెంటనే తేరుకున్నాడు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి 'గుర్తుందా శీతాకాలం' అనే టైటిల్ ను ఖరారు చేశారు. మేఘ ఆకాశ్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ముగింపు దశకి చేరుకుంది.

ఈ సినిమా తరువాత సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో నితిన్ 'శ్రీనివాస కల్యాణం' చేయనున్నాడు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమా, మార్చి నుంచి రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టుకోనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. మిక్కీ జె.మేయర్ సంగీతాన్ని సమకూర్చుతోన్న ఈ సినిమాలో, కథానాయికగా పూజా హెగ్డే నటించనుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందనున్నట్టు సమాచారం.     

  • Loading...

More Telugu News