nam amma: కొత్త టీవీ ఛాన‌ల్‌, వార్తా ప‌త్రిక ప్రారంభించ‌బోతున్న అన్నాడీఎంకే

  • నామ్ అమ్మ‌, అమ్మ టీవీ అని పేర్లు
  • వార్తాప‌త్రిక ఎడిట‌ర్‌గా మ‌రుధు అల‌గురాజ్‌
  • గ‌తంలో న‌మధు ఎంజీఆర్‌కి ఎడిట‌ర్‌గా ప‌నిచేసిన మ‌రుధు

త‌మిళ‌నాడులో త‌మ పార్టీ ప్ర‌చారం, కార్య‌క‌లాపాల విస్త‌ర‌ణ కోసం త్వ‌ర‌లో ఓ కొత్త టీవీ ఛాన‌ల్‌, వార్తాప‌త్రికను అన్నాడీఎంకే పార్టీ ప్రారంభించ‌బోతోంది. వార్తాప‌త్రికకు నామ్ అమ్మ అని, టీవీ ఛానల్‌కి అమ్మ టీవీ అని పేర్లు పెట్ట‌నున్నారు. ఇప్ప‌టికే వార్తాప‌త్రిక ఆవిష్క‌ర‌ణ‌కు సంబంధించి అన్ని ర‌కాల ప‌నులు పూర్త‌‌య్యాయ‌ని పార్టీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. రాష్ట్ర ప్ర‌భుత్వం చేపడుతున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల వివ‌ర‌ణ‌లు, ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు కౌంట‌ర్లు ఇవ్వ‌డ‌మే ధ్యేయంగా ఈ ప‌త్రిక‌ను నెల‌కొల్ప‌నున్న‌ట్లు తెలుస్తోంది.

అన్నాడీఎంకే స్థాప‌కుడు ఎంజీ రామ‌చంద్ర‌న్ జ‌యంతి రోజైన జ‌న‌వ‌రి 17న గానీ, జ‌య‌లలిత జ‌యంతి రోజైన ఫిబ్ర‌వ‌రి 24న గానీ ఈ వార్తాప‌త్రిక‌ను ప్రారంభించ‌నున్న‌ట్లు స‌మాచారం. నామ్ అమ్మ ప‌త్రిక‌కు ఎడిట‌ర్‌గా మ‌రుధు అల‌గురాజ్ వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. గ‌తంలో న‌మ‌ధు ఎంజీఆర్ ప‌త్రిక‌కు ఈయ‌న ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు. ప్ర‌స్తుతం ఈ న‌మ‌ధు ఎంజీఆర్ ప‌త్రిక‌ను శశిక‌ళ కుటుంబ స‌భ్యులు చూసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News